Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అడుగడుగునా పోలీసులు...

ఈ రోజు అమరావతి ఐకాస-జేఏసీ, వామపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం 6000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

ఈ రోజు అమరావతి ఐకాస-జేఏసీ, వామపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం 6000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం వదలకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి గ్రామ కూడళ్ల వద్ద ఫెన్సింగ్ తో  పోలీస్ పహారా కాస్తున్నారు. వజ్ర, గ్యాస్ పార్టీ, ఫైర్ ఇంజన్ వాహనాలను సచివాలయం వద్ద అందుబాటులో ఉంచారు. సచివాలయంతో సహా తుళ్లూరు మండలం మొత్తం 144 సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉంది.