Asianet News TeluguAsianet News Telugu

విశాఖ నుండి ఢిల్లీకి...గంజాయి అక్రమ రవాణా...

విశాఖ ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న13 లక్షల 25 వేల విలువైన 220 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 

విశాఖ ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న13 లక్షల 25 వేల విలువైన 220 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించి ముందస్తు సమాచారం మేరకు స్థానిక రింగురోడ్డు జంక్షన్ లో కాపుకాసిన ఎక్సైజ్ అధికారులు హోండా సిటీ కారును సీజ్ చేశారు. కారులో ఢిల్లీకి రవాణాచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మూడు సెల్ఫోన్లు 21,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.