Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ కూలీలకు గాయాలు

తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయి పది మందికి గాయపడ్డారు.

తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు కూలీలతో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయి పది మందికి గాయపడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం  గోగులపాగు గ్రామంలో మిరపకాయల కోత కోయడం కొరకు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ఇరికేపల్లి గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.  

ప్రమాదాన్ని గుర్తించిన ఇరికేపల్లి గ్రామస్తులు అక్కడికి చేరుకుని పడిపోయిన ఆటోని పైకి లేపి గాయపడిన వారికి సహాయం అందించారు. గాయాలైన పది మందిని అంబులెన్స్ లో ఎక్కించి గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. 
 

Video Top Stories