Prajasanthi Party
(Search results - 17)TelanganaMay 28, 2019, 4:41 PM IST
కెఎ పాల్ మెడ చుట్టూ ఉచ్చు: మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు
కేఏ పాల్ తన అసిస్టెంట్ జ్యోతి అనే యువతి పేరుతో చెక్ ఇవ్వాలని కోరారని అందుకు తాను రూ.2లక్షల చెక్ ను ఇచ్చానని తెలిపారు. చెక్ ను క్యాష్ చేసుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారని, పట్టించుకోవడం లేదని దాంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Andhra PradeshMay 22, 2019, 6:08 PM IST
ఇప్పుడు బాధపడితే ఏం లాభం చంద్రబాబు, నేను ఈ ఎన్నికలను బహిష్కరించా: కేఏ పాల్
ఏపీలో 30 అసెంబ్లీ నియోకజవర్గాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాను చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరితే ఈసీ స్పందించలేదన్నారు.
Andhra PradeshApr 6, 2019, 6:55 PM IST
జగన్! పిచ్చి వేషాలు వెయ్యకు, దమ్ముంటే డైరెక్ట్ గా రా!!: కేఏ పాల్
తనపై అర్థరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దాడి చేశారని ఆరోపించారు. రాత్రి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ లేదని చెప్పడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం హోటల్ సిబ్బంది సీసీ ఫుటేజ్ ఇవ్వడంతో శాంతించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 7:52 PM IST
సైకిల్, ఫ్యాన్, పగిలిపోయే గ్లాస్ లకి ఓటేయొద్దు: కేఏ పాల్ పిలుపు
తనకు భద్రత కల్పించాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు తనకు భద్రత కల్పించడం లేదన్నారు. తనకే భద్రత కల్పించలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. జగన్కు అధికారం ఇస్తే రాష్ట్రం రావణకాష్టమవుతుందని, పగిలిపోయే గ్లాస్ కి ఓటేస్తే ఎందుకు పనికిరాకుండా పోతామని స్పష్టం చేశారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 7:53 PM IST
వైసీపీకి కేఏ పాల్ దెబ్బ: ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అయిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందని దానికి కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. గుర్తును మార్చాలని మార్చి 8న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలినట్లుగా ఉండే విధంగా అభ్యర్థులను ప్రజాశాంతి పార్టీ పోటీకి నిలిపిందని ఫిర్యాదులో పేర్కొంది.
Andhra Pradesh assembly Elections 2019Mar 25, 2019, 8:27 PM IST
పవన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించా, కుట్రతోనే నామినేషన్ అడ్డుకున్నారు: కేఏ పాల్ ఫైర్
భీమవరం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తానన్న ఆందోళన నేపధ్యంలోనే భీమవరంలో నామినేషన్ వేయకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 23, 2019, 3:25 PM IST
రూట్ మార్చిన కేఏ పాల్: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటేనని హెచ్చరించారు. చంద్రబాబుకు నినాదాలివ్వడమే చేతకాదని ఎద్దేవా చేశారు. మీ భవిష్యత్తు మా బాధ్యత అనే నినాదాన్ని చంద్రబాబు ఇస్తున్నారని, ఈ నినాదం వెనుక ఉన్న అర్థం ఏంటో చెప్పాలని నిలదీశారు. నిరుద్యోలు ఉద్యోగాలు రాకుండా చావాలనా, రైతులు ఆత్మహత్య చేసుకోవాలనా, కంపెనీలు అన్నీ దివాళ తీయాలనా ఏ ఉద్దేశంతో మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారో చెప్పాలని ప్రశ్నించార కేఏ పాల్.
Andhra PradeshMar 9, 2019, 5:49 PM IST
ఒక్కో సీటుకు వెయ్యికోట్లు ఖర్చుపెట్టినా జగన్ సీఎం కాలేడు: కేఏ పాల్
ఒక్కో సీటుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా వైసీపీ గెలవలేదని ఆరోపించారు. దళితులు, మైనార్టీలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. అందువల్లే హెలికాప్టర్, ఫ్యాన్ గుర్తులు ఒకేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
Andhra PradeshMar 3, 2019, 7:10 AM IST
వైఎస్ జగన్ సీఎం కాలేడు, మళ్లీ జైలుకే
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారంటూ చెప్పుకొచ్చారు. జగన్ ఓడిపోతారన్న భయంతో రాహుల్ ను కలిశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ కలిసిపోయాయని ఆరోపించారు.
TelanganaFeb 20, 2019, 8:34 PM IST
నాకొక లేఖ రాస్తే ట్రంప్ ని తీసుకొచ్చి అప్పులు తీర్చేస్తా: కేసీఆర్ కి కేఏ పాల్ బంపర్ ఆఫర్
కేసీఆర్ నాకొక లేఖ రాస్తే చాలు ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి ఏప్రిల్ 20లోగా ట్రంప్ను ఇండియాకు తీసుకువస్తానన్నారు. 10 బిలియన్ డాలర్లను రప్పిస్తానని ఆ మెుత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు సమంగా ఇస్తానని ప్రకటించారు.
Andhra PradeshJan 30, 2019, 6:29 PM IST
జగన్ దొబ్బేసిన లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరుతాయి : కేఏ పాల్
తాను రాజకీయం కొత్తగా మొదలు పెట్టలేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని పాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని పాల్ ధీమా వ్యక్తం చేశారు.
Andhra PradeshJan 26, 2019, 12:14 PM IST
పెద్ద ప్లాన్ ఇదే: జగన్ పై కెఎ పాల్ ఆస్త్రం, బాబుకు ప్లస్
కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లోకి రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను చీల్చేందుకు కేఏ పాల్ ఎన్నికలంటూ నానా హడావిడి చేస్తున్నారంటూ చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఏపీలో క్రైస్తవ సోదరుల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం.
Andhra PradeshJan 24, 2019, 6:36 AM IST
గురువునైన నాపై కుట్రలా, దేవుడు నిన్ను క్షమించడు: చంద్రబాబుపై కేఏ పాల్
రాబోయే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని కేఏ పాల్ జోస్యం చెప్పారు. దేవుడికి చంద్రబాబుపై కోపం వచ్చిందని, అనాథలకు, వితంతువులకు ఆయన విరుధ్ధంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే దేవుడు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
Andhra PradeshJan 10, 2019, 1:29 PM IST
ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయావ్, నా సత్తా నీకు తెలియదా..?: జగన్ పై కేఏ పాల్ మండిపాటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పాల్ పార్టీలోని తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడంటూ విరుచుకుపడ్డారు.
Andhra PradeshJan 5, 2019, 8:29 PM IST
మా పార్టీని గెలిపిస్తే రూ.7కోట్ల కోట్ల రూపాయల నిధులు తెస్తా: కేఏపాల్
తమ పార్టీ అధికారంలోకి వస్తే లోటు బడ్జెట్ ఉండదు. మిగులు బడ్జెట్ ఉంటుంది. రెండు లక్షల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తాం. ఐదు లక్షల కోట్లతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆయన చెప్పుకొస్తున్నారు.