Asianet News TeluguAsianet News Telugu

మందేసి నడిపారు: రోడ్డుపై కారు బీభత్సం (వీడియో)

 జూబ్లీహిల్స్ లో ఓ కారు మెట్రో ఫిల్లర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిలస్తున్న యువకులు మద్యం సేవించి, ఆ మత్తులో మితిమీరిన వేగంతో కారును నడిపినట్లు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 వైపు నుంచి కొండాపూర్ కు వెళ్తున్న ఆ కారు అదుపుతప్పింది.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఓ కారు మెట్రో ఫిల్లర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిలస్తున్న యువకులు మద్యం సేవించి, ఆ మత్తులో మితిమీరిన వేగంతో కారును నడిపినట్లు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 వైపు నుంచి కొండాపూర్ కు వెళ్తున్న ఆ కారు అదుపుతప్పింది. స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. 

కొండాపూర్ కు చెందిన జయంత్, పవన్ లతో పాటు మరో వ్యక్తి కలిసి కారులో అర్థరాత్రి వేళ షికారుకు బయల్థేరారు. ఫుల్లుగా మందేశారని, అతి వేగంతో అజాగ్రత్తతో నడపడం వల్ల కారు అదుపుతప్పిందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఓ మెట్రో ఫిల్లర్ ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. 

కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ఉన్న ముగ్గుర్ని మాదాపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. తాను ఓ పోలీసు అధికారి బంధువునని జయంత్ అనే యువకుడు రెచ్చిపోయాడు. అయితే కారు తాను నడపలేదని.. పవన్ అనే వ్యక్తి నడిపాడంటూ పోలీసులకు చెప్తున్నాడు జయంత్. 

కారు నడిపిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అక్కడి నుంచి కారును తొలగించి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Video Top Stories