Asianet News TeluguAsianet News Telugu

మరి కొద్దిరోజుల్లో అమెరికా పర్యటన.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

 హైదరాబాద్ లోని జేఎన్ టీయూలో విద్య ధ్రువీకరణ పత్రాలు తీసుకొని బైక్ పై హైవే పై సొంతూరుకు బయలు దేరారు.

Youth Died in an accident in Malkajagiri
Author
Hyderabad, First Published Sep 9, 2021, 8:11 AM IST

మరికొద్ది రోజుల్లో అతను అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడకు వెళ్లి.. ఉన్నత విద్యను అభ్యసించాల్సి ఉండగా అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.  ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన ప్రొద్దుటూరి మణిదీప్(24) బీటెక్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగానికి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోని జేఎన్ టీయూలో విద్య ధ్రువీకరణ పత్రాలు తీసుకొని బైక్ పై హైవే పై సొంతూరుకు బయలు దేరారు.

ఈ క్రమంలో శామీర్ పేట పెద్ద చెరువు వద్దకు రాగానే కాసారం వైపు చూస్తూ వాహనాన్ని నడిపించారు. వాహనం అదుపుతప్పి చెరువు కట్టపై ఉన్న రెయిలింగ్ ను ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. తండ్రి నాగరాజు రోదిస్తున్న ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.  కాగా.. అతను హెల్మెట్ పెట్టుకున్నా.. చనిపోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios