Asianet News TeluguAsianet News Telugu

ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు.. కలవొద్దు అని చెప్పడంతో...

ఈ క్రమంలో కుటుంబసభ్యులకు తెలియకుండా యువతి మహేష్ ని కలవడానికి వచ్చింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మహేష్ ని అరెస్టు చేశారు. అతని గ్రామస్థులు స్టేషన్ కి వచ్చి అతనిని విడిపించి ఇంటికి తీసుకువెళ్లారు.
 

youth commits suicide after love failure in kesara
Author
Hyderabad, First Published Jan 20, 2020, 8:35 AM IST

ఓ యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమె లేకుంటే తన జీవితమే లేదు అనుకున్నాడు. అలాంటి అమ్మాయిని జీవితంలో కలవొద్దు అని చెప్పడంతో తట్టుకోలేక పోయాడు. తన ప్రాణాలనే వదిలేశాడు. ఈ సంఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన మహేష్(22) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఓ యువతిని చూసి ప్రేమించడాడు. చాలాసార్లు ఆ యువతితో మాట కలిపాడు. ఈ విషయం యువతి కుటుంబీకులు చూడటంతో.... మహేష్ ని మందలించారు. ఆ అమ్మాయి కూడా మహేష్ ని ఇష్టపడినా.. ఆమె కుటుంబీకులు మాత్రం అంగీకరించలేదు.

Also Read గర్ల్ ఫ్రెండ్ తో లాడ్జికి వెళ్లి... శవంగా మారిన డీజే

ఈ క్రమంలో కుటుంబసభ్యులకు తెలియకుండా యువతి మహేష్ ని కలవడానికి వచ్చింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మహేష్ ని అరెస్టు చేశారు. అతని గ్రామస్థులు స్టేషన్ కి వచ్చి అతనిని విడిపించి ఇంటికి తీసుకువెళ్లారు.

ఇంకెప్పుడూ ఆ యువతిని కలవొద్దని అందరూ మందలించారు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక తనకు దూరమయ్యిందనే బాధతో మహేష్... ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios