Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. ఆస్పత్రి గదిలో మద్యం తాగించి...

ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

woman gang raped in nizamabad
Author
Hyderabad, First Published Sep 29, 2021, 10:03 AM IST

నిజామాబాద్ (nizamabad)లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతి మీద సామూహిక అత్యాచారానికి (gang rape)పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. 

ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనమీద కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మరోవైపు హైదరాబాద్ మౌలాలీలో ఓ మహిళ ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకులు తీసుకుంది. కాగా.. బాధితుడిని రక్షించిన పోలీసులు.. మహిళతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... మౌలాలీ ఆర్టీసీ కాలీనీ చెందిన షేక్ వాజీద్(31), ఆప్షియా బేగం(24)లకు 20212లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వాజీద్ బస్టాండ్ ప్రాంతంలోని చెప్పుల దుకాణంలో సేల్స్ మెన్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆప్షియా బేగంకు ముషీరాబాద్ కు చెందిన క్యాటరింగ్ పనులు చేసే ఆసిఫ్ పరిచయమయ్యాడు. అతనికి గతంలో రెండుసార్లు వివాహం జరిగి పిల్లలున్నారు. ఆసియా బేగం గత ఏప్రిల్ ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది.  ఆమె భర్త మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు.

Disha accused Encounter: సిర్పూర్కర్ కమిటీ ముందుకు నేడు సజ్జనార్

అయినా మరోసారి పిల్లలతో కలిసి ప్రియుడి వద్దకే వెళ్లిపోవడంతో అత్తమామల సహాయంతో తిరిగి తీసుకువచ్చాడు. భర్తతో ఉండటం తనకు ఇష్టం లేదని.. విడాకుల కోసం ఆమె ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకే అతను అంగీకరించలేదు. ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయిచుకున్న ఆప్షియా బేగం అతడితో కలిసి కిడ్నాప్ పథకం వేసింది.

దీంతో.. ఆసిఫ్ ముషీరాబాద్, పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్(31), ఎండీ జాఫర్(33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్ ఇందుకు సిద్ధం చేశాడు. వీరు నలుగురు పథకం ప్రకారం షేక్ వాజీద్ ని కిడ్నాప్ చేశారు. బలవంతంగా మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. కాగా.. ఈ కిడ్నాప్ విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసుల రక్షించారు. కిడ్నాప్ కి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios