హైదరాబాద్ శివారులో దారుణం... మహిళపై ఆటోడ్రైవర్ల గ్యాంగ్ రేప్
మహిళతో పరిచయం పెంచుకుని, ఫుల్లుగా కల్లు తాగించి మత్తులోకి జారుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటో డ్రైవర్లను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేసారు.
రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారులో కల్లుతాగి మత్తులో వున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఆటోడ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేసారు. కల్లు కాంపౌడ్ లో మహిళతో పరిచయం పెంచుకున్న ఆటో డ్రైవర్లు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రాజేంద్రనగర్ ఏసిపి గంగాధర్ తెలిపారు.
ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధి నిమిత్తం Hyderabad కు వచ్చిన ఓ 32ఏళ్ల మహిళ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు వుండటంతో ప్రతిరోజూ విధులు ముగించుకుని హైదర్ గూడలోని కల్లు కాంపౌండ్ కు వెళ్లి తాగేది. ఇలా ఈ నెల 13వ తేదీన కూడా కల్లు తాగడానికి వెళ్లిన ఆమెకు జగద్గిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ ఈగంటి నరేశ్(31) తో పరిచయం ఏర్పడింది.
read more పోర్న్ సైట్లకు బానిసై మహిళలతో అసభ్య ప్రవర్తన... హైదరబాదీ యువకుడిపై పిడి యాక్ట్
ఈ క్రమంలోనే తనకు కల్లు తెచ్చివ్వాలని ఆమె నరేష్ ను మహిళ కోరింది. దీంతో ఆమెకు ఫుల్లుగా మద్యం తాగించిన అతడు మరో ఇద్దరు ఆటోడ్రైవర్ నర్సింగరావు, బాకాపురం ప్రసాద్ తో కలిసి బయటకు తీసుకువచ్చారు. కల్లు తాగి మత్తులో వున్న ఆమెను ఆటోలో హిమాయత్ సాగర్ వైపు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై ముగ్గురు కలిసి gang rape కు పాల్పడ్డారు. ఆమె వద్ద గల సెల్ ఫోన్, పర్స్, మెడలోని గొలుసు లాక్కుని పరారయ్యారు.
స్పృహలోకి వచ్చిన మహిళ తనపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించి నేరుగా rajendra nagar పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వేట సాగించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆటోను గుర్తించి... నిందితులు ఆగంటి నరేశ్, నర్సింగ్రావు యాదవ్, బాకాపూరం ప్రసాద్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మహిళ సెల్ ఫోన్, గొలుసు, పర్స్ తో పాటు ఆటోను కూడా స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ కింద కేసులు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి గంగాధర్ వెల్లడించారు.