Asianet News TeluguAsianet News Telugu

ఆ పదంతో రాద్దాంతం, స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు: కేటీఆర్‌పై నిర్మల వ్యాఖ్యలు

పార్లమెంట్‌లో తెలంగాణ నేతలు మాట్లాడిన మాటలు తాను విన్నానన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. 

union finance minister nirmala sitharaman fires in telangana minister ktr
Author
Hyderabad, First Published Feb 16, 2020, 7:14 PM IST

పార్లమెంట్‌లో తెలంగాణ నేతలు మాట్లాడిన మాటలు తాను విన్నానన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు.

అనంతరం నిర్మల మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గివెన్ అన్న పదం వాడారని.. ఆ పదానికి పార్లమెంట్‌లో అనుమతి ఉందని ఆమె గుర్తుచేశారు. ఒకవేళ ఆ పదంపై అభ్యంతరం ఉంటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయవచ్చునని సీతారామన్ స్పష్టం చేశారు.

Also Read:ఆ విషయంలో మోడీకి మద్దతిచ్చి తప్పు చేశాం: కేటీఆర్ సంచలనం

కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గలేదని.. ఏ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసే ఉద్దేశ్యం ఉండదన్నారు. గివెన్ అన్న పదాన్ని మంత్రి కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉందన్న ఆమె.. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదన్నది అవాస్తవమన్నారు.

ఈసారి 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించామని నిర్మల పేర్కొన్నారు. అదనంగా ఒక శాతాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించామని ఆమె గుర్తుచేశారు.

Also Read:టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్: అక్కడికే హరీష్ రావు పరిమితం

సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ ఇవ్వలేకపోయామని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా జీఎస్టీ నిధులు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

త్వరలోనే ఈ నిధులు విడుదల చేస్తామని.. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని నిర్మల స్పష్టం చేశారు. తెలంగాణకి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios