విద్యార్ధిని శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : ఫోన్ కొనివ్వకకాదు.. రేప్ చేసి చంపేశారు, తండ్రి సంచలనం
మెదక్ జిల్లాలో విద్యార్ధిని శ్రావణి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బిడ్డను తోటి విద్యార్ధులే అత్యాచారం చేసి చంపేశారని శ్రావణి తండ్రి మల్లేశం ఆరోపిస్తున్నారు.
మెదక్ జిల్లాలో (medak district) విద్యార్ధిని శ్రావణి ఆత్మహత్య కేసులో (sravani suicide case) ట్విస్ట్ చోటు చేసుకుంది. తోటి విద్యార్ధులు అసభ్యకరమైన మెసేజ్లతో వేధించారని, శ్రావణి తండ్రి మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెని అత్యాచారం చేసి చంపేశారని ఆయన ఆరోపించారు. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించారని.. తమ కుమార్తెను గిరిబాబు, నర్సింగ్, తేజ బ్లాక్ మెయిల్ చేశారని మల్లేశం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ కొనివ్వకపోతే చనిపోయింది అనేది అవాస్తవమని మల్లేశం ఖండించారు.