Asianet News TeluguAsianet News Telugu

టి-కాంగ్రెస్ బస్సుయాత్రకు విపరీతంగా స్పందన (వీడియో)

టి-కాంగ్రెస్ బస్సుయాత్రకు విపరీతంగా స్పందన 

లంగాణ  కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా చైతన్య బస్సుకు యాత్ర కు స్పందన విపరీతంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆయన ఎనలేని ఉత్సాహం నింపుతున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ చెప్పే విషయాలు వినేందుకు ఇలా తండోపతండాలుగా వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఆసక్తి కరమయిన మార్పేదో రాబోతున్నదనేందుకు ప్రతిపక్షానికి లభిస్తున్న ఆదరణ ఒక కొలమానమే. నిన్న భద్రాద్రి-కొత్త గూడెం జిల్లా ఎల్లెందులో జరిగిన ప్రజా చైతన్య బస్సు యాత్రకు స్పందన ఇది. అక్కడి సభలో మాట్లాడుతూ పోడు, అటవీ భూములను రక్షించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనని తీవ్రంగా విమర్శిస్తూ  ఖమ్మంలో రైతులకు సంకెళ్ల వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వనిదేనని మర్చిపోరాదని, కెసిఆర్ రైతు ప్రేమ కపటప్రేమ  అని వ్యాఖ్యానించారు.

Video Top Stories