Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన యాక్టర్ నందు


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నందు ఈడీ విచారణకు మంగళవారం నాడు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీన నందు విచారణకు హాజరు కావాలి. అయితే ఈడీ అధికారుల అనుమతితో నందు ఇవాళ విచారణకు హాజరయ్యారు.

tollywood drugs case: cine actor Nandu appears before Enforcement directorate probe
Author
Hyderabad, First Published Sep 7, 2021, 11:27 AM IST

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నందు మంగళవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి సినీ నటుడు నందు ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈడీ అనుమతితో నందు ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులను ఈడీ విచారిస్తోంది. ఈ మేరకు 12 మంది సినీ నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకొన్నాయని ఈడీ గుర్తించింది. దీంతో సినీనటులను బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ నెల 8వ తేదీన సినీ నటుడు దగ్గుబాటి రానా, ఈ నెల 9న రవితేజలు ఈడీ విచారణకు రానున్నారు.ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో ఎక్సైజ్ శాఖ విచారణ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాల పేర్లు లేవు. కానీ ఈడీ విచారణలో ఈ ఇద్దరి పేర్లను చేర్చారు.డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఈడీకి అఫ్రూవర్ గా మారాడు కెల్విన్ స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు సినీ నటులను ప్రశ్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios