టాలీవుడ్ డ్రగ్స్ కేసు... ఈడీ ముందుకు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్, విచారణ ప్రారంభం (వీడియో)
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న మాధకద్రవ్యాల కేసులో హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ విచారణ నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యింది.
హైదరాబాద్: గతకొంత కాలంగా టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. గతంలో బయటపడ్డ డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలుగు సినీపరిశ్రమకు చెందిన వారిని విచారిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రముఖ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో విచారణ నిమిత్తం రకుల్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇప్పటికే పలువురు తెలుగుసీనీ ప్రముఖులను ఈ డ్రగ్స్ వ్యవహారంపై విచారించారు ఈడీ అధికారులు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీని ఈడీ విచారించింది. అయితే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా రకుల్ కు ఈడీ నోటీసులు పంపింది. కానీ వరుస షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నానని.. కొంత గడువు ఇవ్వాలని అధికారులను రకుల్ కోరింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలన్న రకుల్ అభ్యర్ధను ఈడీ అధికారులకు తిరస్కరించి శుక్రవారమే(ఇవాళ) విచారణకు రావాలని ఆదేశించారు.
దీంతో ఇవాళ ఉదయమే రకుల్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ వ్యవహారం, మనీ ల్యాండరింగ్ తదితర విషయాలపై రకుల్ ను ఈడీ ప్రశ్నించే అవకాశం వుంది. ఆమె బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించనున్నారు. అలాగే వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీసే అవకాశాలున్నాయి.
వీడియో
డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే ఛార్మీ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్ హౌస్కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.
ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ విచారిస్తోంది. గతంలో ఎక్సైజ్ అధికారుల ముందు తనకెమి తెలియనట్టు చెప్పి డ్రామా ఆడిన డ్రగ్ డీలర్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో అలెర్ట్ అయ్యాడు. ఈడీ కేసుతో అప్రూవల్గా మారాడు. సినిమా వాళ్ల చిట్టాను ఈడీకి ఇచ్చాడు డ్రగ్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ సమాచారంతోనే సినీ తారాలకు నోటీసులు ఇచ్చింది. కెల్విన్ బ్యాంకు ఖాతాలోకి భారీగా పంపినట్టు ఈడీ గుర్తించింది. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది.
కెల్విన్ బ్యాంకుకు డబ్బులు పంపిన సినీ తారల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ మాటున నిధుల అక్రమ మళ్లింపు ఏదైనా జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఈడీ డ్రగ్స్ కేసును అవకాశంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22 వరకూ జరిగే విచారణలో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. వారి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.