Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు విచారణకు రాలేను, మరో తేదీ కేటాయించండి: ఈడీకి రకుల్‌ప్రీత్‌సింగ్ లేఖ

ఈ నెల 6వ తేదీన జరిగే విచారణకు తాను హాజరు కాలేనని సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ తేల్చి చెప్పారు. తనకు మరో తేదీని కేటాయించాలని కోరారు. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు  సినీ నటులకు నోటీసులు జారీ చేశారు. 

tollywood drug case: Rakul  preet singh writes letter to ED,seeks more time from ED
Author
Hyderabad, First Published Sep 2, 2021, 3:44 PM IST

హైదరాబాద్:ఈ నెల 6వ తేదీన  జరిగే విచారణకు  కొన్ని కారణాల వల్ల హాజరు కాలేనని సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఈడీ అధికారులకు సమాచారం పంపారు. విచారణకు తనకు మరో తేడీ ఇవ్వాలని ఆమె కోరారు.ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు నోటీసులు పంపారు.  టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన విచారణలో రకుల్ ప్రీత్‌సింగ్, దగ్గుబాటి రానాల పేర్లు లేవు. అయితే ఈడీ విచారణలో వీరిద్దరి పేర్లు చేరాయి.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన ఛార్మి

ఈ నెల 6వ తేదీన ఈడీ విచారణకు రకుల్‌ప్రీత్ సింగ్  హాజరు కావాల్సి ఉంది. బాలీవుడ్ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో కూడ రకుల్ ప్రీత్ సింగ్ పేరు  కూడా ప్రచారంలోకి వచ్చింది.ఈడీ అధికారులు రకుల్‌ప్రీత్‌సింగ్ కి మరో తేదీ రోజున విచారణకు రావాలని కోరుతారా లేదా అనేది ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ ప్రముఖ నటి ఛార్మికౌర్ ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.  ఈ నెల 22వ తేదీవరకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ అధికారులు విచారించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios