Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన ఛార్మి


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి గురువారం నాడు ఈడీ అధికారుల విచారణకు హాజరైంది. ఎక్సైజ్ అధికారుల విచారణ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
 

Tollywood actress Charmi appears before Enforce directorate probe
Author
Hyderabad, First Published Sep 2, 2021, 11:07 AM IST

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి గురువారం నాడు ఈడీ  అధికారుల విచారణకు హాజరైంది. ఎక్సైజ్ అధికారుల విచారణ ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్ పై  కేసు నమోదుచేశారు. కెల్విన్  ఈడీకి అఫ్రూవర్ గా మారారు.

 కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు  ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు  నోటీసులు జారీ చేశారు. ఛార్మి, డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న కెల్విన్ మధ్య  వాట్సాప్ ఛాటింగ్ కూడ జరిగిందని కూడ ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఛార్మి బ్యాంకు స్టేట్‌మెంట్లను కూడ తీసుకురావాలని కూడ ఆదేశించారు.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరీ విచారణలో కీలక విషయాలు.. తెరపైకి ముగ్గురు ఆఫ్రికన్ల పేర్లు

ఛార్మి నడుపుతున్న ప్రొడక్షన్ హౌస్ నుండి  కెల్విన్ కు డబ్బు సరఫరా  అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  రెండు రోజుల క్రితం ఈడీ అధికారులు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించారు. 

ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో  తన వెంట పెద్ద ఎత్తున బౌన్సర్లను ఆమె తీసుకొచ్చుకొంది.  విచారణకు వెళ్తున్న  సమయంలో ఛార్మిని మీడియా ప్రతినిధులు పలు విషయాలపై ప్రశ్నిస్తే ఆమె సమాధానం చెప్పలేదు. ఛార్మి తన వెంట బ్యాంకు స్టేట్ మెంట్ ను తీసుకొచ్చినట్టుగా సమాచారం..

Follow Us:
Download App:
  • android
  • ios