Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో కలిసి భార్య మృతి, కుళ్లిన శవాలు: భర్త ఆత్మహత్య

వివాహేతర సంబంధం రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ప్రియుడితో కలిసి మహిళ మృతి చెందగా, ఆ మహిళ భర్త ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Three commit suicide in Khammam district due to illicit relation
Author
Khammam, First Published Sep 3, 2021, 7:53 AM IST

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంపల్లిలో గురువారంనాడు ఈ సంఘటన వెలుగు చూసింది. 

లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య (32), కృష్ణవేణి (27) భార్యాభర్తలుగా నివాసం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (30)తో కృష్ణవేణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఇరువురు ఆగస్టు 26వ తేదీన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో అవమానం భరించలేక బాలయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.బాలయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 29వ తేదీన మరణించాడు. 

అదే కాలనీకి చెందిన వజ్రమ్మ అనే మహిళ ఇటీవల వేంసూరులోని తన కూతురు వద్దకు వెళ్లి గురువారం తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తీయగానే ఆమెకు కుళ్లిపోయిన స్థితిలో రెండు శవాలు కనిపించాయి. దాంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుస్తుల ఆధారంగా శవాలను గుర్తించారు. ధర్మయ్య, కృష్ణవేణిల మృతదేహాలుగా తేల్చారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ధర్మయ్యకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన స్త్రీతో పెళ్లయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, విభేదాలు తలెత్తడంతో అతని భార్య విస్సన్నపేట పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. దాంతో అతను భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios