Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై రేప్, నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం: మంత్రి మల్లారెడ్డి సంచలనం


మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామన్నారు.

Telangana minister Malla Reddy sensational comments on minor girl rape murder case
Author
Hyderabad, First Published Sep 14, 2021, 4:33 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి  హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం నాడు ఆయన  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు.  నిందితుడిని కచ్చితంగా పట్టుకొంటామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని మంత్రి తెలిపారు. 

also read:సింగరేణి కాలనీలో బాలికపై రేప్, హత్య: రాజుతో కలిసి మద్యం సేవించిన మిత్రుడు

నిందితుడిని వదిలిపెట్టబోమని మల్లారెడ్డి తేల్చి చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని కూడ ఆయన చెప్పారు.ఈ నెల 9వ తేదీన సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యచేశారు. నిందితుడు రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రాజు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 

బాలికను హత్య చేసిన రోజున స్నేహితుడితో కలిసి మద్యం తాగినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.నిందితుడు రాజు స్నేహితుడితో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios