Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించానని దగ్గరయ్యాడు.. కట్ చేస్తే వాట్సప్‌ స్టేటస్‌లో ప్రియురాలి నగ్న వీడియో.. అసలేం జరిగిందంటే..

బాలికకు ప్రేమ పేరుతో దగ్గరైన ఓ వ్యక్తి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. కట్ చేస్తే.. బాలిక నగ్న వీడియోను వాట్సాప్‌ స్టేషన్‌గా పెట్టుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని suryapet జిల్లా హుజూర్‌నగర్‌‌‌ మండంలో చోటుచేసుకుంది.

suryapet man booked for upload girlfriend nude video as whatsapp status
Author
Suryapet, First Published Jan 15, 2022, 12:21 PM IST

బాలికకు ప్రేమ పేరుతో దగ్గరైన ఓ వ్యక్తి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. కట్ చేస్తే.. బాలిక నగ్న వీడియోను వాట్సాప్‌ స్టేషన్‌గా పెట్టుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని suryapet జిల్లా హుజూర్‌నగర్‌‌‌ మండంలో చోటుచేసుకుంది. హుజూర్‌నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జింకల సైదులు కుమారుడు మహేశ్‌ (19).. ఆమెతో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మహేశ్ ప్రస్తుతం డిగ్రీ చదవుతున్నాడు. 

గత రెండేళ్లుగా మహేశ్, బాలిక ప్రేమించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు బాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితం బాలికకు వీడియో కాల్ చేసిన మహేశ్.. నగ్నంగా కనిపించాలని కోరాడు. దీంతో బాలిక అతను చెప్పినట్టుగా చేసింది. అయితే ఆ వీడియో కాల్‌ను రికార్డు చేసుకన్న మహేశ్.. సేవ్ చేసుకున్నాడు. అయితే చెప్పినప్పుడు తన వద్దకు రావాలని బాలికపై మహేశ్ బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాకుండా తాను చెప్పినంటూ వినకుంటే వీడియోను బయటపెడతానని హెచ్చరించేవాడు. 

ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మహేశ్.. బాలికకు ముఖం చాటేశాడు. ఇక, నాలుగు రోజుల క్రితం మహేశ్ తన whatsapp స్టేషన్‌లో బాలిక నగ్న వీడియోను పెట్టాడు. అయితే బాలికతో పరిచయం ఉన్న కొందరు ఈ విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన బాలిక.. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం తల్లిదండ్రుల సహకారంతో హుజూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. మహేశ్‌పై అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు.

మరోవైపు బాలిక తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి మహేశ్‌ ఇంటికి ముందు ఆందోళనకు దిగింది. అనంతరం మహేశ్‌ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మహేశ్‌ కూడా పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కోదాడ డీఎస్పీ రఘు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios