Asianet News TeluguAsianet News Telugu

బూతులు తిడుతూ రాళ్ల దాడి: పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడిపై వాచ్‌మెన్ భార్య


సినీ నటుడు పోసాని కృష్ణ మురళి  ఇంటిపై రాళ్ల దాడికి సంబంధించి కొన్ని విషయాలను వాచ్ మెన్ భార్య  మీడియాకు తెలిపారు. మంగళవారం నాడు  కొందరు వ్యక్తులు బూతులు తిడుతూ తిరిగారన్నారు. బుధవారం నాడు మాత్రం  రాళ్ల దాడికి దిగారని ఆమె చెప్పారు.

stone pelting on posani krishna murali: watchman wife reveals key informaion about stone pelting
Author
Hyderabad, First Published Sep 30, 2021, 12:31 PM IST

హైదరాబాద్: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై (posani krishna murali) బూతులు తిడుతూ ఆయన ఇంటిపై రాళ్లతో (stone pelting) దాడికి దిగారని  ఆ ఇంట్లో పనిచేసే వాచ్ ‌మెన్ భార్య  (watchman wife) మీడియాకు తెలిపారు. రెండు రోజుల క్రితం  కూడ పోసాని కృష్ణ మురళి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ  మీడియా సమావేశం ముగించుకొని పోసాని కృష్ణ మురళి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు  ఆయనపై దాడికి ప్రయత్నించారు.  అదే రోజు అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలోని పోసాని కృష్ణ మురళి ఇంటి వద్ద కొందరు వ్యక్తులు బూతులు తిట్టుకొంటూ బైక్ లపై తిరిగారని వాచ్ మెన్ భార్య మీడియాకు చెప్పారు.

also read:పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి: పోలీసుల దర్యాప్తు

బుధవారం నాడు రాత్రి  పోసాని కృష్ణ మురళి నివాసంపై రాళ్లతో దాడికి దిగారు.  అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్లతో దాడికి దిగారని తమకు అనుమానం  ఉందని ఆమె చెప్పారు. ఇద్దరి వ్యక్తుల మాటలు విన్పించినట్టుగా ఆమె తెలిపారు.దాదాపుగా 10 మాసాలుగా పోసాని కృష్ణ మురళి దంపతులు ఈ నివాసంలో ఉండడం లేదని ఆమె చెప్పారు.

తమకే ఇంటిని అప్పగించి వెళ్లారని ఆమె చెప్పారు.దీంతో రాత్రి పూట తాము ఈ ఇంటి వద్దే పడుకొంటామని తెలిపారు. రెండు రోజులుగా పోసాని కృష్ణ మురళిని దూషిస్తూ కొందరు తిరుగుతున్నారని ఆమె చెప్పారు. రాళ్ల దాడి జరిగిన తర్వాత పురుషోత్తం అనే వ్యక్తి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆమె తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios