దామస్తాపూర్ సర్పంచ్ దౌర్జన్యం: ప్రశ్నించినందుకు కాలితో తన్ని, బూతులు తిట్టాడు
గ్రామంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించినందుకు దామస్తాపూర్ గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కాలితో తన్నాడు. బూతులు తిట్టాడు.ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ (TRS)కు చెందిన సర్పంచ్ సమస్యలపై నిలదీసిన గ్రామస్తుడిని కాలితో తన్నాడు. అంతేకాదు అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతేకాదు బూతులు తిట్టారు.జిల్లాలోని దామస్తాపూర్(Damastapur) గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డిని(jaipal reddy) అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (srinivas reddy)అనే వ్యక్తి సమస్యలపై నిలదీశాడు. గ్రామంలో డ్రైనేజీ, మంచినీటి సమస్యపై ప్రశ్నించాడు. అయితే ఇలా ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ జైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై దాడికి దిగారు.
సర్పంచ్ జైపాల్ రెడ్డి కాలితో ఎగిరి శ్రీనివాస్ రెడ్డిని తన్నాడు.అంతేకాదు అతడిని కిందపడేసి పిడిగుద్దులు కొట్టాడు. బూతులు తిట్టారు. స్థానికులు ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు.తనపై సర్పంచ్ జైపాల్ రెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.