Asianet News TeluguAsianet News Telugu

హెటిరో డ్రగ్స్ సంస్థలో రెండో రోజూ ఐటీ సోదాలు: కీలక పత్రాలు స్వాధీనం

హెటిరో డ్రగ్స్ సంస్థ కార్యాలయాలపై రెండో రోజూ కూడ ఐటీ అధికారులు  సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలతో పాటు హర్డ్ డిస్క్ లను ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేశారు. ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

Second day IT raids on Hetero drugs offices
Author
Hyderabad, First Published Oct 7, 2021, 11:33 AM IST

హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ అధికారులు రెండో రోజూ సోదాలు కొనసాగిస్తున్నారు. బుధవారం నాడు ఉదయం నుండి hetero drugs సంస్థపై ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు ప్రారంభించారు. హైద్రాబాద్ సహా మూడు ప్రాంతాల్లో బుధవారం నాడు Income tax అధికారులు తనిఖీలు నిర్వహించారు.

also read:హైద్రాబాద్‌హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ సోదాలు: 20 బృందాల తనిఖీలు

సుమారు 20 మంది సభ్యులు గల బృందం  టీమ్‌లుగా విడిపోయి హెటిరో సంస్థలో సోదాలు నిర్వహిస్తున్నారు.  గురువారం నాడు కూడ హెటిరో డ్రగ్స్ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హైద్రాబాద్, విశాఖపట్టణం, గుంటూరు, విజయవాడల్లోని సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ సంస్థ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లలో  అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలతో పాటు, ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

కోవిడ్ సమయంలో  సంస్థ ఆదాయ వ్యయాలతో పాటు ఐటీ రిటర్న్స్ పత్రాలను  ఆదాయ పన్ను శాఖాధికారులు పరిశీలించినట్టుగా తెలిసింది.హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్లు సందీప్ రెడ్డి, నరసింహరెడ్డి,వంశీకృష్ణ, పార్ధసారథిరెడ్డిలతో పాటు మరికొందరి ఇళ్లపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.కుబేరులైన తెలుగువారి జాబితాలో పార్ధసారథి రెడ్డి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios