సైదాబాద్లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య కేసు నిందితుడు ఆత్మహత్య: నిర్ధారించిన కేటీఆర్
సైదాబాద్ లో ఆరేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈ విషయాన్ని డీజీపీ సమాచారం ఇచ్చారని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలోని ఆరేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి హత్యచేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.వారం రోజుల క్రితం సింగరేణికాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడు రాజు కోసం వెయ్యి మంది పోలీసులు గాలిస్తున్నారు.
also read:సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: నిందితుడు రాజు ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై శవం
పోలీసుల నుండి తప్పించుకొనే మార్గం లేకపోవడంతో రాజు స్టేషన్ఘన్ పూర్ రైల్వేట్రాక్ పై ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని తనకు డీజీపీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారని మంత్రి తెలిపారు. రాజును గతంలోనే అరెస్ట్ చేసినట్టుగా మంత్రి ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై మంత్రిపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ మరోసారి ట్వీట్ చేశారు.తన పొరపాటును తెలుసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారని మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.