Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్‌లో మైనర్ బాలికపై రేప్, హత్య: వరంగల్‌కి మైనర్ బాలిక పేరేంట్స్, ఎందుకంటే....

సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన ఆరేళ్ల మైనర్ బాలిక కుటుంబంతో పాటు సింగరేణి కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు వరంగల్ ఎంజీఎంకి తరలించనున్నారు. చనిపోయింది రాజు అవునో కాదోననే అనుమానాన్ని మైనర్ బాలిక పేరేంట్స్ వ్యక్తం చేశారు. దీంతో వారిని వరంగల్ కు తరలించే అవకాశం ఉంది.

Saidabad rape and murder case:Hyderabad police plans to bring minor girl parents and others
Author
Hyderabad, First Published Sep 16, 2021, 4:43 PM IST

హైదరాబాద్:  సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన ఆరేళ్ల  మైనర్ బాలిక  కుటుంబసభ్యులతో పాటు  సింగరేణి కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు వరంగల్ ఎంజీఎం తరలించనున్నారు.వినాయకచవితి రోజున సింగరేణి కాలనీలో ఆరేళ్ల  మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేశాడు నిందితుడు రాజు. రాజును ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు,  మైనర్ బాలిక పేరేంట్స్ డిమాండ్ చేశారు.స్టేషన్ ఘన్ పూర్ కి రైల్వేగేట్ సమీపంలో రాజారాం బ్రిడ్జి వద్ద ఇవాళ ఆత్మహత్య చేసుకొన్నాడు.  అయితే రాజు ఆత్మహత్యపై మైనర్ బాలిక పేరేంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. 

also read:సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: రాజారాం బ్రిడ్జి వద్దకు రాజు ఇలా చేరాడు....

ఆత్మహత్య చేసుకొంది రాజు అనేది ఎలా నిర్ధారించారని వారు ప్రశ్నించారు. సింగరేణి కాలనీకి మృతదేహన్ని తీసుకురావాలని వారు కోరారు. అయితే మైనర్ బాలిక పేరేంట్స్ , మేనమామ తో పాటు సింగరేణి కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు వరంగల్ కి తరలించనున్నారు. వరంగల్ లో  రాజు మృతదేహన్ని  చూపించాలని పోలీసులు భావిస్తున్నారు.పోలీసులే వరంగల్ కు వీరిని హైద్రాబాద్ నుండి తీసుకురానున్నారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios