సైదాబాద్లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య: ఉప్పల్లో రాజు కదలికలను గుర్తించిన పోలీసులు
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజుఉపయోగించిన కవర్ ను పోలీసులు గుర్తించారు. ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఈ కవర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కవర్లో కల్లుసీసా, టవల్ ను గుర్తించారు.
హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉప్పల్ సిగ్నల్ వద్ద రాజు ఉపయోగించిన కవర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత నిందితుడు రాజు ఎల్బీనగర్ వద్ద తన స్నేహితుడితో కలిసి మద్యం తాగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్ నుండి రాజు ఉప్పల్ వైపు వెళ్లినట్టుగా గుర్తించారు. నగరంలోని సుమారు వెయ్యి సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఉప్పల్ సిగ్నల్ వద్ద రాజు రోడ్డు దాటిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఉప్పల్ వద్ద రాజు తన వద్ద కవర్ ను పారేశాడు. ఈ కవర్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
also read:సైదాబాద్ హత్యాచారం కేసు: నిందితుడు వేషం మార్చొచ్చు.. రాజు గుండుతో ఉంటే ఇలా
ఈ కవర్లో కల్లుసీసాతో పాటు టవల్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రాజు స్నేహితుడి ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడి వద్ద రూ. 700 ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో పోలీసులను నియమించారు. 180 మద్యం, కల్లు దుకాణాల వద్ద పోలీసులు మఫ్టీలో విధుల్లో ఉన్నారు. ఇవాళ రాత్రి లోపుగా నిందితుడిని పట్టుకొంటామని పోలీసులు ధీమాగా ఉన్నారు.
నిందితుడు రాజుకు ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు భార్య, తల్లి, అక్క, బావ, స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటన జరిగిన తర్వాత తన భార్యకు డబ్బులు పంపాలని తల్లికి రాజు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు రాజుకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోలీసులు విడదుల చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో రాజు ఫోటోలను అంటించారు.ఇసుక లారీల అడ్డాల వద్ద కూడ రాజు కోసం పోలీసులు మఫ్టీలో ఉన్నారు.
: