నల్గొండలో దారుణం... భార్యతో కలిసి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న పూజారి
కట్టుకున్న భార్యతో కలిసి ఓ పూజారి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న దారుణం నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. ఓ డిగ్రీ విద్యార్థినితో ఈ దంపతులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
నల్గొండ: అతడో పూజారి. ఎంతో పవిత్రంగా వుంటూ పూజలు చేయాల్సిన అతడు ఈజీ మనీ కోసం గలీజ్ దందా ప్రారంభించాడు. కట్టుకున్న భార్యతో కలిసి ఏకంగా ఓ వ్యభిచార గృహాన్నే నిర్వహిస్తున్న సదరు పూజారిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రమేష్ చారి పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఇలా పూజలు చేసి పవిత్రమైన సంపాదనను కాదని గలీజ్ దందాలోకి దిగాడు. నల్గొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని brothel house ని నిర్వహిస్తున్నాడు. కట్టుకున్న భార్యతో కలిసే రమేష్ చారి వ్యభిచార దందా ప్రారంభించాడు.
నిరుపేద యువతులు, మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నాడు. ఇలా ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరికొందరు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. వివిధ మార్గాల్లో విటులను ఆకర్షించి వారినుండి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. వ్యభిచార గృహానికి సంబంధించి వ్యవహారాలన్ని రమేష్ చారి భార్య చూసుకునేది.
read more సొంత చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..
అయితే ఈ వ్యభిచార గృహంపై నల్గొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఇంటిపై నిఘాపెట్టిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో నిన్న(ఆదివారం) రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పోలీసులకు పట్టుబడిన వారిలో రమేష్ చారి భార్యతో పాటు ఓ డిగ్రీ విద్యార్థిని, మరో మహిళ వున్నారు. అలాగే ఇద్దరు విటులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అసలు నిందితుడు రమేష్ చారి మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యభిచార గృహ నిర్వహకురాలియి రమేష్ భార్యతో పాటు ఇద్దరు విటులు, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అలాగే డిగ్రి విద్యార్థిని, మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
read more స్నేహితుడి భార్యపై కన్ను... బెదిరించి పలుమార్లు అత్యాచారం, బ్లాక్ మెయిల్....
ఇక మహిళల ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని డబ్బుల ఆశచూపి వ్యభిచారం కూపంలోకి లాగుతున్న ఓ దుర్మార్గుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని జీడిమెట్ల సంజయ్ గాంధీ నగర్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు కటకం సాయికుమార్. ఈ గదిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల ఆర్థిక అవసరాలను తీరుస్తానంటూ మొదట నమ్మించి ఆ తర్వాత మెల్లిగా వారిని వ్యభిచార కూపంలోకి లాగేవాడు. వారితో అద్దెకు తీసుకున్న గదిలో వ్యభిచారం చేయించేవాడు.
ఇలా ఇటీవల ఇద్దరు మహిళలతో అతడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. దీంతో సాయికుమార్ కదలికలపై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం దందా నిర్వహిస్తున్నాడని నిర్దారించుకున్నారు. దీంతో మహిళలతో పాటు ఇద్దరు మహిళలు గదిలో వుండగా దాడిచేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
brothel house నిర్వహకుడు సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు. సాయి లాంటి దుర్మార్గుల మాటల నమ్మి అమ్మాయిలు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.