Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో తొమ్మిదో తరగతి బాలిక కిడ్నాప్.. సామూహిక అత్యాచారం..

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె మీద గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. 

ninth class girl kidnapped, gang-raped in hyderabad
Author
First Published Nov 8, 2022, 8:57 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. ఆపై ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ మేరకు బాలిక ఫిర్యాదుతో మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సోమవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్తుండగా యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. బైక్ మీద మూడు గంటల పాటు తిప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక అరుపులు విని అటు వైపుగా వెడుతున్న ఓ వ్యక్తి.. అక్కడికి రాగా.. అతడిని చూసిన నిందితులు పారిపోయారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు బాలికను గత కొద్ది రోజులుగా వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.

తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్...

ఇదిలా ఉండగా, అక్టోబర్ 1న పాట్నాలో ఇలాంటి షాకింగ్ ఘటనే వెలుగు చూసింది. బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుబని జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆ బాలికను విక్రయించారు. ఈ కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆ తరువాత ఓ మహిళా పింప్‌కు రూ.50,000లకు అమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌజిల్లాకు చెందిన బృందం సోనీదేవి అనే మహిళా పింప్ చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్టయిన వారిని జైనగర్‌లోని అశోక్ మార్కెట్‌లో నైట్‌గార్డు సోనీ దేవి, అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సాజన్ కుమార్‌గా గుర్తించారు. జైనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆచార్య..పోలీసు డ్రైవర్, రామ్‌జీవన్ పాశ్వాన్ అనే చోకీదార్ పరారీలో ఉన్నారు. బాధితురాలు నెల రోజుల క్రితం తన సొంత ఊరు మౌ నుండి దారితప్పి మధుబని జిల్లా జైనగర్ పట్టణానికి చేరుకుంది. అశోక్ మార్కెట్‌లో ఒంటరిగా తిరుగుతుంటే ఆమెను అర్జున్ యాదవ్ గమనించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులను పిలిపించి, నలుగురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఒక గదిలో బందీగా ఉంచారు.

ఆమె మీద పదేపదే అత్యాచారానికి పాల్పడడమే కాకుండా తమకు తెలిసిన వారిని కూడా పిలిచి ఆమె మీద అత్యాచారం చేయించారు. కాగా, బాధితురాలు ఇంట్లో కనిపించకపోవడంతో మౌలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మౌ పోలీసుల బృందం మధుబని జైనగర్ పట్టణానికి చేరుకుంది. అనుమానంతో సోనీ దేవి ఇంటిపై దాడి చేసింది. అక్కడ ఆ బాలిక  ప్రాణాలతో బయటపడింది. పోలీసులు వెంటనే ఆమెను రక్షించి, మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

ఘటనను ధృవీకరిస్తూ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు జైనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంజయ్ కుమార్ తెలిపారు. ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. జైనగర్ ఎస్‌డిపిఓ మాట్లాడుతూ, "మావు పోలీసులు మహిళా పింప్ ఇంటిపై దాడి చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణలో కొంతమంది నిందితుల పేర్లు మా వద్ద ఉన్నాయి" ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios