Asianet News TeluguAsianet News Telugu

వైష్ణవి హత్యలో ట్విస్ట్: రేప్ చేసి, చంపి ఆటోలో తెచ్చి పడేశారు

వాకింగ్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన వైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసిందే. 

New twist in Vaishnavi murder case
Author
Meerpet, First Published Aug 28, 2018, 8:05 AM IST

హైదరాబాద్‌: వాకింగ్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన వైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌ మేడిపల్లి ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో ఈ వైష్ణవి హత్యకు గురైంది. తల, ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలున్నాయి. దీంతో దుండుగులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ విషయం నిర్ధారణ కానుంది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన అనసూయ, ప్రభు కుటుంబం హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. బడంగ్‌పేటలోని రాజీవ్‌ గృహకల్ప 10వ బ్లాక్‌లో మూడేళ్లుగాఉంటున్నారు. వీరి కూతరు వేవూరి వైష్ణవి (14) జిల్లెలగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

అనుసూయ జిహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తుండగా, ప్రభు దినసరికూలీగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వైష్ణవి వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.  అనసూయ సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు కనిపించలేదు. దీంతో భర్తకు ఆ విషయం తెలిపింది. 

దాంతో దంపతులు స్థానికులతో కలసి వైష్ణవి స్నేహితులను, బంధువులను సంప్రదించినా ఫలితం కనిపించలేదు. దీంతో రాత్రి ఏడు గంటలకు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. 

కాగా, సోమవారం ఉదయం ఆరు గంటలకు రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ భవనం పక్కన ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనసూయ, ప్రభు దంపతులకు విషయాన్ని తెలియజేశారు. వారు అక్కడి వెళ్లి చూడగా తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో వైష్ణవి విగతజీవిగా కనిపించింది. 

దుండగులు వైష్ణవిని ఆదివారం ఉదయమే కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాత ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను నీటిలో ముంచి శ్వాస ఆగిపోయేలా చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. 

మరణించిన తర్వాత మృతదేహా న్ని ఆటోలో తీసుకువచ్చి డ్వాక్రా భవనం పక్క న పడేసి వెళ్లిపోయి ఉండచ్చని  భావిస్తున్నా రు. ఘటనాస్థలంలో ఆటో టైర్ల అచ్చులను గమనించిన పోలీసులు ఓ ఆటోవాలాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 
 
డ్వాక్రా భవనం పక్కనే కమ్యూనిటీ చర్చి ఉంది. చర్చికి నలువైపుల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దుండగులకు ఈ సీసీ కెమెరాల సంగతి ముందే తెలుసునని, అందుకే ఆటోను చర్చి ముందు నుంచి కాకుండా గల్లీల నుంచి తీసుకువచ్చి అదే మార్గంలో వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. 

అందువల్ల రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉండేవారే అ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. తెలిసినవారే ఈ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు.  

ఈ కింది వార్త చదవండి

రంగారెడ్డి జిల్లాలో దారుణం

Follow Us:
Download App:
  • android
  • ios