హెటిరో ఐటీ సోదాల్లో కొత్త కోణం: ఇన్వాయిస్లలో తప్పుడు సమాచారం, శనివారం వరకు తనిఖీలు
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెటిరో కార్పోరేట్ ఆఫీసులో భారీగా నగదు గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు . ముడి సరుకు దిగుమతి పేరుతో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు.
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెటిరో కార్పోరేట్ ఆఫీసులో భారీగా నగదు గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు . ముడి సరుకు దిగుమతి పేరుతో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో హెటిరో ముడి సరుకు దిగుమతి చేసుకున్నట్లుగా తేల్చారు. అయితే ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లుగా ఐటీ అధికారులు నిర్ధారించారు. వాటిని విలువ తక్కువ చేసే ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా గుర్తించారు. మెడిసిన్ తయారు చేస్తున్న కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. శనివారం వరకు సోదాలు కొనసాగే అవకాశం వుందని సమాచారం.
కాగా,హెటిరో డ్రగ్స్ సంస్థ కార్యాలయాలపై బుధవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. hetero drugs సంస్థ డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు, ఇళ్లలో ఇవాళ ఉదయం నుండి ఆదాయ పన్ను శాఖాధికారులు ఇంకా సోదాలు చేస్తున్నారు.
Also Read:హైద్రాబాద్హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ సోదాలు: 20 బృందాల తనిఖీలు
హైద్రాబాద్ తో పాటు మరో మూడు ప్రాంతాల్లో income tax అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 20 ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేతకు సంబంధించి హెటిరో కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కోవిడ్ రోగుల కోసం హెటిరో డ్రగ్స్ సంస్థ ఇటీవలనే టోసిలిజుమాబ్ అనే మందును తయారు చేసింది. Tocilizumab కి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని హెటిరో డ్రగ్స్ సంస్థ తెలిపింది.
స్టెరాయిడ్ ల స్థానంలో corona తీవ్రంగా సోకిన వారికి లేదా ఆక్సిజన్ వెంటిటేషన్ అవసరమైన వారికి ఉపయోగించడానికి లైసెన్స్ పొందాయి. టోసిలిజుమాబ్ ను హెటిరో హెల్త్ కేర్ దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తోందని హెటిరో గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్ పార్ధసారథి రెడ్డి ప్రకటించారు. హైద్రాబాద్ కు సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న సెజ్ లోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఈ మందును తయారు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.