Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల, పవన్

హైద్రాబాద్ నగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో  ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు రాజు అనే నిందితుడు. రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఇవాళ వైఎస్ఆర్‌టీపీ షర్మిల, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.

minor girl rape and murder in Hyderabad:   pawan kalyan and YS Sharmila to visit victim family
Author
Hyderabad, First Published Sep 15, 2021, 11:18 AM IST


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబాన్ని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు పరామర్శించనున్నారు.

also read:సైదాబాద్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల, వపన్

వినాయకచవితి రోజునే చిప్స్ ప్యాకెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై  లాఠీచార్జీ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు.

ఆ ఘటన జరిగిన రోజు నుండి  రాజకీయ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇవాళ  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios