Asianet News TeluguAsianet News Telugu

యువకుడి దారుణ హత్య.. ఉరివేసి, కొత్తితో పొడిచి, నగ్నంగా..!

పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేయగా గౌస్ నగర్, మహావీర్ కళాశాల దిశల్లో 2 కిలో మీటర్లు వెళ్లి ఓ షెట్టర్ వద్ద ఆగిపోయాయి. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఫలక్ నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ పరిశీలించారు.
 

Man Brutally Murdered In Patabasti
Author
Hyderabad, First Published Sep 22, 2021, 7:34 AM IST

ఓ యువకుడిని దుండగులు అతి దారుణంగా హత మార్చారు. ఉరి వేసి.. 26సార్లు కత్తితో పొడిచి మరీ చంపేశారు. అనంతరం శవాన్ని నగ్నంగా ఆటోలో తీసుకువెళ్లి.. పాత బస్తీ లేక్ వ్యూ హిల్స్ లోని నిర్మానుష ప్రదేశంలో పడేశారు. చంద్రాయణ గుట్ట ఇన్ స్పెక్టర్  ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయపు నడకకు లేక్ వ్యూ హిల్స్ కు వెళ్లిన కొందరు అక్కడి రోడ్డుపై యువకుడు హత్యకు గురై ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు,

పోలీసులు చేరుకొని సుమారు 26ఏళ్ల వయసున్న యువకుడిని హత్య చేసి తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేయగా గౌస్ నగర్, మహావీర్ కళాశాల దిశల్లో 2 కిలో మీటర్లు వెళ్లి ఓ షెట్టర్ వద్ద ఆగిపోయాయి. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఫలక్ నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ పరిశీలించారు.

మృతుడి శరీరం పై దాదాపు 12 చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి. మృతుడు కుల్సుంపురా పోలీస్ స్టేషన్ టోలీ మసీదుకు చెందిన మహ్మద్ ఆసిఫ్ గా గుర్తించారు. తల్లి పర్వీన్ బేగం ఆసిఫ్ మృతదేహాన్ని గుర్తు పట్టారు, సోమవారం రాత్రి ఆసిఫ్ స్నేహితుల వెంట వెళ్లినట్లు ఆమె తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు చంద్రాయణ గుట్ట, ఆసిఫ్ నగర్, టప్పాచబుత్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios