Asianet News TeluguAsianet News Telugu

అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య...

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంకలహాల నేపథ్యంలో ఓ అన్న తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. దీనిమీద పోలీసులు విచారణ చేపట్టారు. 

man brutally murdered by his brother in Jagittala District
Author
Hyderabad, First Published Apr 16, 2022, 12:54 PM IST

జగిత్యాల జిల్లా : Jagittala District గొల్లపల్లి మండలం రంగ దమున పల్లెలో దారుణం జరిగింది.  అన్న చేతిలో తమ్ముడి brutally murderకు గురయ్యాడు. గొల్లపల్లి మండలం రంగ దమున పల్లె  గ్రామానికి చెందిన చీపిరిశెట్టి శ్రీకాంత్(28) తన అన్న చేతిలోనే మరణించాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబకలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రంగదాముని పల్లిలో ఉంటున్న తన అన్న చీపిరిశెట్టి గోపాల్ ఇంటి వద్దకు శ్రీకాంత్ గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గోపాల్ గొడ్డలితో శ్రీకాంత్ తలపై దాడి చేశాడు.

దెబ్బ బలంగా తాకడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలి, మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన మీద పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఇంత దారుణం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఇదిలా ఉండగా, మార్చి 23న మెదక్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. two-wheelerన్ని కొనుగోలు చేసేందుకు Ear piercings ఇవ్వలేదనే కోపంతో ఒక కొడుకు తన తల్లి గొంతు నులిమి murder చేశాడు. ఈ సంఘటన medak జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్ గ్రామంలో జరిగింది. నిజాంపేట ఏఎస్ఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి పోచమ్మ (76) కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు కుమార్ గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడు. కాగా సోమవారం రాత్రి పోచమ్మ చిన్న కుమారుడు తనకు ద్విచక్రవాహనం కావాలని అందుకు చెవి కమ్మలు ఇవ్వమని తల్లితో వాగ్వాదానికి దిగాడు. 

తల్లి  చెవి కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో కుమార్ ఆవేశంతో తల్లి పోచమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. ఇది చూసిన పెద్ద కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు.మృతురాలి పెద్దకుమారుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెల్లడించారు. తూప్రాన్ సిఐ శ్రీధర్,  రామయంపేట్ ఎస్సై రాజేష్, పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఆ తరువాత మృతదేహానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు చెప్పారు. 

ఇలాంటి దారుణమే క్రిష్ణా జిల్లా మచిలీ పట్నంలో నిరుడు నవంబర్ లో జరిగింది.  హరీష్ అనే యువకుడు తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య గురువారం మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios