Asianet News TeluguAsianet News Telugu

బూతులు తిట్టాడని.. సిమెంట్ ఇటుకతో తలపై బాది.. స్నేహితుడి హత్య..

ఆ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. కలిసే మద్యం తాగుతుంటారు. ఆ సమయంలో బూతులు తిట్టుకుంటారు. అదంతా వారిద్దరి మధ్య మామూలే కానీ.. ఏమయ్యిందో ఏమో కానీ.. ఆ బూతులు నచ్చకే ఓ స్నేహితుడిని మరో స్నేహితుడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో జరిగింది.

man assassinated his friends over scolding at hyderabad - bsb
Author
Hyderabad, First Published May 18, 2021, 9:22 AM IST

ఆ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. కలిసే మద్యం తాగుతుంటారు. ఆ సమయంలో బూతులు తిట్టుకుంటారు. అదంతా వారిద్దరి మధ్య మామూలే కానీ.. ఏమయ్యిందో ఏమో కానీ.. ఆ బూతులు నచ్చకే ఓ స్నేహితుడిని మరో స్నేహితుడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో జరిగింది.

ఇన్ స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ కృపా అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి ఏం. శ్యాంసుందర్ (31), చైనా బజార్ దగ్గర్లోని విజయ అపార్ట్ మెంట్లో ఉంటున్న డ్రైవర్ పుల్లం నవీన్ (33) రెండేళ్లుగా స్నేహితులు. 

ఇద్దరూ కలిసి తరచుగా మద్యం తాగుతుంటారు. ఆ టైంలో శ్యాం సుందర్.. నవీన్ తో పాటు అతడి కుటుంబ సభ్యులను కూడా బూతులు తిడుతుంటాడు. దీంతో నవీన్, శ్యాంసుందర్ మీద కక్ష పెంచుకున్నాడు. 

ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి నవీన్ ఇంట్లోనే మద్యం తాగారు. ఆ తరువాత శ్యాం సుందర్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే కుటుంబ సభ్యులను తిట్టడం జీర్ణించుకోలేకపోయిన నవీన్ శ్యాం సుందర్ ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత కర్రతో దాడి చేశాడు. 

ఇది గమనించిన శ్యాంసుందర్‌ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెను తోసేశాడు. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో  శ్యాం సుందర్ తలమీద బాది వెళ్లిపోయాడు. వెంటనే శ్యాం సుందర్ తల్లి 100 కి డయల్ చేసింది. సమాచారం అందుకున్న నేరేడ్ మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

అప్పటికే అతడు మృతి చెందాడని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్ స్పెక్టర్ నర్సింహస్వామి, క్రైం పార్టీ బృందాలు సందర్శించి ఆదారాలు సేకరించారు. నిందితుడు నవీన్ అరెస్ట్ చేసినట్టు, మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్ స్పెక్టర్ వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios