Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి జిల్లాలో దారుణం: బైక్ పై తీసుకెళ్లి మహిళపై అత్యాచారం

బస్సు  కోసం  వేచి చూస్తున్న  మహిళను బైక్ పై తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు. ఈ ఘటన  కామారెడ్డి  జిల్లాలో  చోటు  చేసుకుంది. 

KamaReddy Police  Files   Case  Against  Two  For   Rape on Woman lns
Author
First Published Jun 2, 2023, 10:19 AM IST

కామారెడ్డి: బస్సు కోసం  వేచి  చూస్తున్న మహిళను  బైక్ పై  ఊళ్లో దింపుతామని  చెప్పిఇద్దరు  యువకులు మహిళపై సామూహిక  అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటన కామారెడ్డి  జిల్లాలో  చోటు  చేసుకుంది.  బాధితురాలి  ఫిర్యాదు  మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

జుక్కల్ వెళ్లేందుకు  ఖండే  బల్లూరులో  బస్సు కోసం  మహిళ  నిరీక్షిస్తుంది.  మహిళకు చెందిన  యువకుడు బైక్ పై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైక్ పై మరో యువకుడు  కూడా  ఉన్నాడు.  బైక్ పై గ్రామానికి తీసుకెళ్తామని  మహిళను నమ్మించారు.  తమ గ్రామానికి  చెందిన  యువకుడేనని  మహిళ నమ్మింది.  బైక్ పై  ఎక్కింది. గ్రామానికి వెళ్లే మార్గంలో  నిర్మానుష్యప్రాంతంలో   మహిళపై  ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై  బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు  నమోదు  చేసి దర్యాప్తు  చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios