Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ తీసుకోలేదు, కానీ పార్టీకి హాజరయ్యా: బెంగుళూరు డ్రగ్స్ కేసుపై కలహర్ రెడ్డి

ఆ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని  బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కలహర్ రెడ్డి చెప్పారు.

kalahar Reddy reveals key information about bangalore drug case lns
Author
Hyderabad, First Published Apr 13, 2021, 4:06 PM IST

హైదరాబాద్: ఆ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని  బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కలహర్ రెడ్డి చెప్పారు.మంగళవారం నాడు కలహర్ రెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం బెంగుళూరుకు సమీపంలోని పామ్ హౌస్ లో పార్టీ జరిగిన విషయం వాస్తవమేనని ఆయన ఒప్పుకొన్నారు. ఆ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదన్నారు. ఇదే విషయాన్ని తాను పోలీసులకు చెప్పినట్టుగా చెప్పారు. 

also read:డ్రగ్స్ కేసు: నోటీసులకు స్పందించని ఇద్దరు తెలంగాణ వాసులు.. బెంగళూరు పోలీసుల సీరియస్

ఈ కేసు విషయమై బెంగుళూరు పోలీసులు అందించిన నోటీసులు అందాయన్నారు. ఈ నోటీసులు అందుకొన్న తాను పోలీసుల విచారణకు హాజరైనట్టుగా ఆయన తెలిపారు.శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి  ఈవెంట్ మేనేజర్లు, సినీ ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారని ఆయన చెప్పారు. డగ్ర్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

also read:బెంగుళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలోని నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చే ఛాన్స్

ఈ పార్టీకి తెలంగాణకు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రజా ప్రతినిధులు ఎవరనే విషయమై ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. బెంగుళూరు డ్రగ్స్ కేసును ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలనే అరెస్టైన నైజీరియన్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ జరిపితే ఈ పార్టీ విషయం వెలుగు చూసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios