హైదరాబాద్ నగరంలో ఈ నెలఖారు నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా బోనాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.
హైదరాబాద్ నగరంలో ఈ నెలఖారు నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా బోనాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించి, తేదీలను ఖరారు చేశారు. అనంతరం వివరాలను మంత్రి తలసాని మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు నిర్వహించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
