హైద్రాబాద్ రాజేంద్రనగర్లో గ్యాంగ్ రేప్: నిందితుల కోసం పోలీసుల గాలింపు
రాజేంద్రనగర్ లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కల్లు దుకాణం నుండి నిందితులు ఆమెను నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
హైదరాబాద్: hyderabad రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై gang rape జరిగింది. బాధిత మహిళ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మహిళపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
also read:అడవిలో పశువుల మేత కోసం వెడితే... దళిత మహిళపై గ్యాంగ్ రేప్..!
బాధిత మహిళకు కల్లు తాగే అలవాటుంది.కల్లు తాగేందుకు ఆమె ప్రతి రోజూ కల్లు దుకాణానికి వచ్చేది. ఒకవేళ కల్లు దుకాణానికి రాలేకపోతే ఎవరితోనైనా కల్లును తెప్పించుకొంటుంది.అయితే నిన్న toddy shop కు వచ్చిన మహిళ కల్లు తాగి బయటకు వచ్చింది. ఆమెను గుర్తించిన ఇద్దరు ఆమెను ఆటోలో తీసుకెళ్తామని చెప్పి నమ్మించి తీసుకెళ్లారు. అయితే ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కడి నుండి రోడ్డుపైకి వచ్చింది.ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.తనపై దుండగులు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది.దీంతో సంఘటన స్థలంలో ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ఆధారాల మేరకు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఎటువైపు వెళ్లారనే విషయమై పోలీసులు cctv footage ను పరిశీలిస్తున్నారు.