Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో దారుణం: బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం

హైద్రాబాద్  నగరంలోని  చాంద్రాయణగుట్టలో బాలికపై  నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

gang rape on girl in Hyderabad
Author
First Published Feb 8, 2023, 10:52 AM IST


హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో  ఓ  బాలికపై  సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు దుండగలు. మెడికల్  దుకాణం వద్దకు  వెళ్లిన  బాలికను ఓ మహిళ ట్రాప్ చేసింది.  తక్కువ ధరకు  మందులను ఇప్పిస్తానని చెప్పి బాలికను  మహిళ తీసుకెళ్లింది. ఈ బాలికను  నలుగురు వ్యక్తులకు  ఆ మహిళ అప్పగించింది.   గంజాయి తాగిన నలుగురు యువకులు గదిలో  బంధించి   సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అత్యాచారానికి పాల్పడే ముందు  బాలికకకు మద్యం తాగించారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు  బాలికను వదిలిపెట్టారు.  ఇంటికి వచ్చిన బాలిక  పేరేంట్స్ కు ఈ విషయం చెప్పింది.  బాధితురాలి  ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios