గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్: తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం
గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ ఆచూకీని పోలీసులు గురువారం నాడు గుర్తించారు. ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్న విసయాన్ని పోలీసులు గుర్తించారు. అతని వద్దే ఆ మహిళ ఉన్నట్టుగా పోలీసులు.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ ఆచూకీని పోలీసులు గురువారంనాడు కనుగొన్నారు. ఏడు పోలీస్ బృందాలు ఆమె ఆచూకీని కనుగొన్నారు.
ఈ నెల 11వ తేదీ నుండి గాంధీ ఆసుపత్రి నుండి అదృశ్యమైంది. ఆమె ఇంతకాలం ఎక్కడుందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుండి ముషీరాబాద్ వైపునకు వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.
also read:గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్: ముషీరాబాద్ వైపు వెళ్లిన మహిళ, గాలింపు
ఆచూకీ లేకుండా పోయిన మహిళకు కల్లు తాగే అలవాటుంది. దీంతో కల్లు కంపౌండ్ వద్ద కూడ పోలీసులు గాలించారు. ఈ దర్యాప్తులో ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. అతడు ఎక్కడ ఉంటారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు.అతని వద్దే ఆ మహిళ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి ఆమెను ప్రశ్నిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా ఆచూకీ లేకుండా పోయిన మహిళ సోదరి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కా చెళ్లెళ్లపై ఏం జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే విషయాలను కూడ పోలీసులు మీడియాకు వివరించనున్నారు.