వివాహేతర సంబంధం : ఆఫీసుకు సెలవుపెట్టి టూర్ ప్లాన్.. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎక్సైజ్ అధికారి..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్ అధికారిని మహిళ కుటుంబ సభ్యులు గురువారం కాపుకాసి పట్టుకున్నారు.
వివాహేతర సంబంధాలు నేటి రోజుల్లో కామన్ అయిపోతున్నాయి. భార్య లేదా భర్తను మోసగించి.. వేరే వారితో సంబంధం పెట్టుకోవడం దానికోసం ఎంతకైనా తెగించడం.. సమాజపు పోకడకు అద్దం పడుతోంది.
అలా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్ అధికారిని మహిళ కుటుంబీకులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్ అధికారిని మహిళ కుటుంబ సభ్యులు గురువారం కాపుకాసి పట్టుకున్నారు.
ఆమెతో సమయం గడపడానికి... ఈ అధికారి విధులకు సెలవు పెట్టి మహిళతో టూర్ కి వెళ్లడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పట్టుకుని దాడి చేసినట్టు తెలిసింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు రాజీ చేసినట్లు సమాచారం.