Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. రూ.20 హెరాయిన్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. టాంజానియా దేశస్థుడి నుంచి రూ.20 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను గుర్తించారు. జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. 

drugs seized in shamshabad airport ksp
Author
Hyderabad, First Published Jun 21, 2021, 9:19 AM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. టాంజానియా దేశస్థుడి నుంచి రూ.20 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను గుర్తించారు. జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. కేసు నమోదు చేసుకుని.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు..? ఎక్కడికి సరఫరా చేస్తున్నాడు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:మొన్న చెన్నైలో.. నేడు హైదరాబాద్‌లో, అదే ఆఫ్రికా మహిళలు: భారీగా డ్రగ్స్ పట్టివేత

కొద్దిరోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు. రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. యుగాండా, జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios