Asianet News TeluguAsianet News Telugu

వంతెన కింద మహిళ నగ్న దేహం: గాజుల్లో వజ్రాలు, దిమ్మతిరిగే విలువ

తంగేడుపల్లి వంతెన కింద వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాల ఆధారంగా ఆమె స్థానికతపై ఓ నిర్ధారణకు వచ్చారు.

Chevella murder case: bangles with rs 15 lakhs value diamonds
Author
Chevella, First Published Mar 19, 2020, 8:57 AM IST

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని తంగేడుపల్లి వంతెన కింద కనిపించిన మహిళ శవం కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తంగేడుపల్లి శివారులోని వంతెన కింద నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. 

ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను బట్టి ఆమె మహరాష్ట్రకు లేదా గుజరాత్ కు చెందిన మహిళ అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై ఉన్న ఆభరణాలను, వాటిపై హాల్ మార్కును బట్టి పోలీసులు ఆ నిర్ధారణకు వచ్చారు. ఆమె ధరించిన గాజులు వజ్రాలతో పొదిగి ఉన్నాయి. ఆ వజ్రాల విలువ రూ. 15 లక్షలపైనే ఉంటుందని అంచనా వేశారు. 

Also Read: కల్వర్టు కింద నగ్నంగా మహిళ శవం: అక్రమ సంబంధమే కారణమా?

35 ఏళ్ల వయస్సు గల ఆ మహిళ కాళ్లకు, చేతులకు కమిలిన గాయాలున్ాయని. దాన్ని బట్టి ఆమె కాళ్లను, చేతులను కట్టేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మెడకు తాడు బిగించి ఉరేశారని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఉరి బిగించి చంపి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపారని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. 

వస్త్రధారణ ఆధారంగా ఆమె ఆనవాళ్లను గుర్తిస్తారనే ఉద్దేశంతో నిందితులు ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలు వివాహిత అని, ఆమెకు పొగ తాగే అలవాటు ఉందని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. పక్కా ప్రణాళికతో ఆమెను హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. 

Also Read: మరో దిశ: యువతి ముఖంపై బండరాయితో మోది... గుర్తు పట్టనంతగా..

ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి తర్వాత మహిళను చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios