Asianet News TeluguAsianet News Telugu

Bandi Sanjay: కేసీఆర్ డైరెక్షన్ లో బీజేపీ నేత‌ల‌పై దాడులు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bandi Sanjay:  తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ‌ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నేత‌లు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల‌కు కార‌ణ‌మ‌ని,  సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో.. ఇటు పోలీసుల ఆధ్వ‌ర్యంలో దాడులు జ‌రుగుతోన్నాయ‌ని బండి సంజయ్ ఆరోపించారు. 
 

BJP Chief Bandi Sanjay Fires On CM KCR
Author
Hyderabad, First Published Jan 29, 2022, 1:38 PM IST

Bandi Sanjay:  తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ‌ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నేత‌లు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల‌కు కార‌ణ‌మ‌ని,  సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో.. ఇటు పోలీసుల ఆధ్వ‌ర్యంలో దాడులు జ‌రుగుతోన్నాయ‌ని బండి సంజయ్ ఆరోపించారు. 

ఆయ‌న శ‌నివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్స‌వానికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో క‌రీంన‌గ‌ర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. 

అభివృద్ధి, ప్ర‌జా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తుందని, ప్రజా సమస్య‌ల ప్ర‌శ్నించే వారిపై అధికార టీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తుందని అన్నారు. ప్ర‌జా ధ‌నాన్ని దోచుకోవ‌డానికి  
కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ విమ‌ర్శించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనన్న బండి సంజయ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి  ముందుకు రావాలని  పిలుపునిచ్చారు.

 ప్రజా సమస్యల పోరాటం చేస్తే.. బీజేపీ నేతలు, కార్య‌కర్త‌ల‌పై దాడులు చేయిస్తున్నార‌ని, త‌మపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో నల్గొండ, కరీంనగర్ లో తనపైనా, ఆర్మూర్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులు సీఎం కుట్రలో భాగమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

ఖమ్మం ప‌ట్ట‌ణంలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తపై పోలీసులు విచక్షణా రహితంగా  దాడి చేసి,  హత్య చేసేందుకు య‌త్నించార‌ని,  స్థానిక సీఐ బూతులు తిడుతూ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నార‌ని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎంకు కొమ్ము కాస్తున్నరని ఆరోపించారు. ఇది స‌రైన‌ పద్దతి కాదని  బండి సంజ‌య్ హెచ్చరించారు.
 
బీజేపీ, బీజేపీ నేత‌ల పేరు వింటేనే కేసీఆర్ కు, కేటీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే బీజేపీ నేత‌లపై, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల చేస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ నేత‌ల‌పై దాడి చేస్తూ..రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నాడని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు చేసి కోట్లు సంపాదించి ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయాలనీ చూస్తున్నదంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా కృషిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios