Asianet News TeluguAsianet News Telugu

బెంగుళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలోని నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చే ఛాన్స్

బెంగుళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధులకు కూడ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Bengaluru police plans to issue notices to four Telangana MLAs for drug case lns
Author
Hyderabad, First Published Apr 5, 2021, 6:29 PM IST

హైదరాబాద్: బెంగుళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధులకు కూడ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

2019లో  బెంగుళూరు శివారులోని ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో నలుగురు తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడ పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసు విషయమై  ప్రాథమిక నివేదికను సిద్దం చేశారు.

ఈ విషయమై నాలుగు ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు.  ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి  బెంగుళూరు పోలీసులు  నోటీసులు పంపారు.ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న సందీప్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ పార్టీలో ముగ్గురు సినీ ప్రముఖులు, 8 మంది ఈవెంట్ మేనేజర్లతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు.కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు పంపారు. అయితే వారు ఈ నోటీసులకు స్పందించలేదు. దీంతో మరో నోటీసు పంపారు.

ఓ యువ ఎమ్మెల్యే  ఇచ్చిన విందులో డ్రగ్స్ ఉపయోగించినట్టుగా గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు  చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారని సమాచారం. ప్రజా ప్రతినిదులకు కూడ నోటీసులు పంపే అవకాశం లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios