Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తల అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత్తు మందుకు బిగ్‌షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా వున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు బిజినెస్‌మెన్‌లు. 

7 business persons arrested in drugs case in telangana
Author
Hyderabad, First Published Jan 20, 2022, 4:41 PM IST

డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత్తు మందుకు బిగ్‌షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా వున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు బిజినెస్‌మెన్‌లు. ముంబై డ్రగ్ మాఫియాకు చెందిన టోనీతో డ్రగ్స్ తెప్పించుకున్నారు వ్యాపారవేత్తలు. ఈ కేసులో పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, ప్రముఖ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

అంతకుముందు hyderabad సీపీ సీవీ Anand గురువారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.వ్యాపారవేత్తలు నిరంజన్ కుమార్ జైన్, శాషవత్ జైన్, యోగనాంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్ రెడ్డి, బండి భార్గవ్,వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్,  సుబ్బారావులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.  హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్ తీసుకొన్న వారి చిట్టా తమ వద్ద ఉందని సీపీ ఆనంద్ చెప్పారు. డ్రగ్స్ తో తీసుకొంటే ఇక జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీపీ చెప్పారు. 

పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న Drugs సరఫరా చేసే నైజీరియన్ టోనిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. దేశంలోని ముఖ్య పట్టణాలకు tony డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు. బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. తాత్కాలికమైన వీసా, పాస్‌పోర్టు తో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని సీవీ ఆనంద్ చెప్పారు. టోనీ వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ గుర్తు చేశారు.  ఇమ్రాన్  అరెస్ట్ చేసిన విషయం తెలియగానే టోని తన వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేశారని సీవీ ఆనంద్ చెప్పారు. 2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చారన్నారు. ముంబైలోని ఈస్ట్ అంథేరిలో నివసిస్తున్నాడని ఆనంద్ వివరించారు.

టోని సహా మరో  9 మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.డ్రగ్స్ తీసుకొనే వారిని అరెస్ట్ చేయకపోతే కట్టడి చేయలేమన్నారు సీపీ. డ్రగ్స్ తీసుకొన్నా, విక్రయించినా వారి మూలాలను వెలికితీస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.ఇప్పటికే  డ్రగ్స్  తీసుకొన్న  ఏడుగురు వ్యాపారులను కూడా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలు, ఆఫీస్ బాయ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొన్నారని సీపీ చెప్పారు. సినీ రంగంలో వారికి ఇకపై డ్రగ్స్ కేసులో మినహాయింపులుండవని ఆయన తేల్చి చెప్పారు. 

హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్  సరఫరా చేసే వారిపై నిఘాను ఏర్పాటు చేశామని  సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సీవీ ఆనంద్ తెలిపారు. పదే పదే డ్రగ్స్ తీసుకొనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. హైద్రాబాద్ లో డ్రగ్స్ తీసుకొంటున్న వారిలో వ్యాపారులు, రాజకీయ నేతల పిల్లలు, సినీ పరిశ్రమకు చెందిన వారున్నారని ఆనంద్ తెలిపారు

Follow Us:
Download App:
  • android
  • ios