Asianet News TeluguAsianet News Telugu

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్... కేవలం రూపాయికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటికే అత్యంత తక్కువ ధరలకు అత్యధిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ల ద్వారా దేశంలోని అత్యధికులను తమ వినియోగదారులుగా మార్చుకుంది. అయితే తమ వినియోగదారులను మరింత పెంచుకోవడంతో పాటు ఇప్పటికే తమ ప్రాడక్ట్స్ ను వినియోగిస్తున్న వారికోసం ఉగాది పండగ సందర్భంగా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ను ప్రకటించింది. 

MI fan festival sale
Author
Hyderabad, First Published Apr 3, 2019, 7:56 PM IST

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటికే అత్యంత తక్కువ ధరలకు అత్యధిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ల ద్వారా దేశంలోని అత్యధికులను తమ వినియోగదారులుగా మార్చుకుంది. అయితే తమ వినియోగదారులను మరింత పెంచుకోవడంతో పాటు ఇప్పటికే తమ ప్రాడక్ట్స్ ను వినియోగిస్తున్న వారికోసం ఉగాది పండగ సందర్భంగా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ను ప్రకటించింది. 

గురువారం నుండి అంటే ఏప్రిల్ 4వ తేదీ నుండి ఈ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌ ద్వారా ఎంఐ తమ సంస్థను అభిమానించే వినియోగదారులకు పలు స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇలా ఈ సేల్ ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగనుంది. 

ముఖ్యంగా రూ.1 కే ఫ్లాష్‌ సేల్‌ను కూడా ఎంఐ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎంఐటీవీని సొంతం చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రెడ్‌మి నోట్‌ 7 ప్రొ,  పోకో ఎఫ్‌ 1, ఎంఐ సౌండ్‌బార్‌, ఎంఐ ఎల్‌ఈడీ4 ప్రొ(32) టీవీ ని ఒక రూపాయి ఫ్లాష్‌ సేల్‌లో విక్రయిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios