Asianet News TeluguAsianet News Telugu

జియో మరో ఆఫర్.. రూ.499కే జియోఫై రూటర్


క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా
 

Jio's Cashback Offer: Here's How Postpaid Users Can Get JioFi Device At Rs. 499

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్‌ను కేవలం రూ.499కే పొందేలా వీలు కల్పించింది. ఇందుకు గాను కస్టమర్లు ముందుగా రూ.999కి జియోఫై రూటర్‌ను కొనుగోలు చేయాలి.

 అనంతరం రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకోవాలి. లేదంటే రూ.199పైన ఉండే ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. తరువాత ఆ ప్లాన్‌లో ఏడాది పాటు కొనసాగితే 12 నెలల అనంతరం రూ.500 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తారు. 

దాన్ని పోస్ట్‌పెయిడ్ బిల్లులో అడ్జస్ట్ చేస్తారు. దీంతో జియోఫై రూటర్ ధర రూ.499 మాత్రమే అవుతుంది. ఇక రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 25 జీబీ డేటా, అన్‌లిమిటెల్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. వినియోగదారులు జియోఫై రూటర్‌ను జియో స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios