Asianet News TeluguAsianet News Telugu

మేకిన్ ఇండియా: వోకల్ ఈజ్ లోకల్

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్​కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్​ లోకల్​' నినాదానికి మద్దతు పెరుగుతోంది.

Indian smartphone company Micromax set to launch 3 smartphones: All you need to know
Author
New Delhi, First Published Jun 21, 2020, 1:48 PM IST

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్​కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్​ లోకల్​' నినాదానికి మద్దతు పెరుగుతోంది.

వీటిని దేశీయ కంపెనీలు క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్​ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయం అని చాలా మంది భావిస్తున్నారు. 

ప్రస్తుత పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని తిరిగి సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నిస్తోంది​. ట్విట్టర్​ ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మైక్రోమ్యాక్స్ ఇచ్చిన సమాధానాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.

‘చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త మోడళ్లను తీసుకురండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు చేయగలరు. అందుకు ఇదే సరైన సమయం. భారతీయులమంతా మీతో ఉంటూ.. మీకు పూర్తి మద్దతు ఇస్తాం’ అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

దీనిపై మైక్రోమ్యాక్స్ స్పందిస్తూ 'వోకల్ ఫర్ లోకల్'​కు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతర్గతంగా కొత్త ఉత్పత్తుల కోసం మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలోనే సరికొత్త ఉత్పత్తులతో మీ ముందుకు వస్తాం’ అని ట్వీట్​ చేసింది.

‘మైక్రోమ్యాక్స్​ మీ నుంచి ఏదైనా మిడ్​రేంజ్ ఫోన్​ను అశించవచ్చా?’ అని మరో అభిమాని ట్విట్​ చేశాడు. దానికి 'ప్రీమియం ఫీచర్లు, మాడ్రన్​ లుక్​, బడ్జెట్ ధరలో కొత్త మోడల్​ త్వరలోనే తీసుకురానున్నట్లు' మైక్రోమ్యాక్స్ సమాధానమిచ్చింది.

కొత్త ఉత్పత్తులతో రానున్నామని చెప్పిన మైక్రోమ్యాక్స్.. వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మైక్రోమ్యాక్స్ ట్వీట్​లతోపాటు పలు టెక్​ వార్తా సంస్థలు సేకరించిన సమచారం ప్రకారం.. త్వరలోనే ఈ కంపెనీ నుంచి మూడు కొత్త స్మార్ట్​ఫోన్లు రానున్నాయి. 

చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ మోడళ్లను తీసుకురానుంది. ఈ మూడు ఫోన్ల ధరలు రూ.10,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోదారులను ఆకర్షించేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నాలు చేయొచ్చు. 

మార్కెట్లో ఇప్పుడు పలు సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లు దేశంలో 75% మార్కెట్​ను శాసిస్తున్నాయి. ఇదే మైక్రోమ్యాక్స్​కు ప్రధాన అడ్డంకిగా మారొచ్చని నిపుణులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios