Asianet News TeluguAsianet News Telugu

రెచ్చగొట్టే వాట్సప్ మెసేజ్‌లు ఇక గుర్తించొచ్చు...అమెరికా తర్వాత భారత్‌లోనే

సోషల్ మీడియా వేదిక ‘వాట్సప్’ నుంచి వెళ్లే వివిధ రకాల ఎస్సెమ్మెస్‌లు ఎక్కడ నుంచి వెళుతున్నాయి, ఎవరు రూపొందిస్తున్నారు అనే అంశాన్ని దర్యాప్తు సంస్థలు అవసరం అనుకుంటే గుర్తించొచ్చు. వాట్సప్ యాజమాన్యం అమెరికా తర్వాత గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించింది భారతదేశంలోనే కావడం గమనార్హం. ఇటీవల పిల్లల కిడ్నాపర్లు, గో రక్షకులు రకరకాల పేర్లతో మెస్సెజ్ లు పంపి మూక దాడులు చేయడం దేశంలో సర్వ సాధారణమైంది. ఈ దాడులకు మూలమైన సందేశాలు ఎక్కడ నుంచి ఎవరు తయారు చేస్తున్నారో గుర్తించి, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా వాట్సప్ మేనేజ్మెంట్‌కు తన వైఖరిని కూడా తెలియజేసింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అవసరమైతే సదరు వాట్సప్ మెసేజ్ ఏ కేంద్రం నుంచి ఎప్పుడు వచ్చింది, ఎవరు పంపారన్న విషయం తెలుసుకోవచ్చునని కేంద్ర ఐటీ, టెలీ కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ సమాచారం ఇచ్చారు. 

identity of those sending provocative messages in whatsapp
Author
Hyderabad, First Published Nov 2, 2018, 3:37 PM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక ‘వాట్సప్’ నుంచి వెళ్లే వివిధ రకాల ఎస్సెమ్మెస్‌లు ఎక్కడ నుంచి వెళుతున్నాయి, ఎవరు రూపొందిస్తున్నారు అనే అంశాన్ని దర్యాప్తు సంస్థలు అవసరం అనుకుంటే గుర్తించొచ్చు. వాట్సప్ యాజమాన్యం అమెరికా తర్వాత గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించింది భారతదేశంలోనే కావడం గమనార్హం. ఇటీవల పిల్లల కిడ్నాపర్లు, గో రక్షకులు రకరకాల పేర్లతో మెస్సెజ్ లు పంపి మూక దాడులు చేయడం దేశంలో సర్వ సాధారణమైంది. ఈ దాడులకు మూలమైన సందేశాలు ఎక్కడ నుంచి ఎవరు తయారు చేస్తున్నారో గుర్తించి, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా వాట్సప్ మేనేజ్మెంట్‌కు తన వైఖరిని కూడా తెలియజేసింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అవసరమైతే సదరు వాట్సప్ మెసేజ్ ఏ కేంద్రం నుంచి ఎప్పుడు వచ్చింది, ఎవరు పంపారన్న విషయం తెలుసుకోవచ్చునని కేంద్ర ఐటీ, టెలీ కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ సమాచారం ఇచ్చారు. 

రెండు రోజుల క్రితం తనతో వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘సదరు మెసేజ్ లను కనిపెట్టే అంశంపై మేం మాట్లాడం. దాని డీ కోడ్ చేసే అంశంపై చర్చకు రాలేదు. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి, లొకేషన్ గుర్తించే అంశంపైనే మేం ద్రుష్టి సారించాం. దేశవ్యాప్తంగా హేయమైన, తీవ్రమైన నేరాలు, రెచ్చగొట్టే హింసకు దారి తీసే వాట్సప్ సందేశాలను గుర్తించాల్సి ఉంది’ అని చెప్పారు. 

వాట్సప్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలన్నదే తమ వైఖరి అన్నారు. ‘కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ తమ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. రెచ్చగొట్టే మెస్సేజ్‌లతో జరిగే నష్టాన్ని నివారించేందుకు పౌర సమాజం, ప్రభుత్వంతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాం’ అని ఆ ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలోగా భారత్ వాట్సప్ అధినేతను నియమించనున్నది. 

మరోవైపు వాట్సప్ సందేశాలు ఎక్కడ నుంచి ఎవరు పంపుతున్నారనే అంశాన్ని గుర్తించాలన్న నిర్ణయం వెనుక మరో నిగూఢార్థం కూడా ఉందని తెలుస్తోంది. అనవసరంగా హింసను ప్రేరేపించే అంశాలతో కూడిన మెస్సెజ్‌లను నియంత్రణించడమే బాగానే ఉంటుంది. కానీ ఇందులో రాజకీయ అవసరాలు కూడా ఇమిడి ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు సమీక్రుతులవుతున్నారు. వివిధ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థలు వేదికలవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాల పరిరక్షణ పేరిట సోషల్ మీడియాను నియంత్రించాలన్న వ్యూహం కేంద్రం అమలు చేయనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios