నవంబర్ 1 నుంచి ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్
నవంబర్ 1వ తేదీ నుంచి దీపావళి సేల్ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది.
దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీ నుంచి దీపావళి సేల్ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది.
నవంబర్ 5వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో రియల్ మి 2 ప్రొ, రెడ్మీ నోట్ 5 ప్రొ, హానర్ 9ఎన్, లెనోవో ఎ5, లెనోవో కె9 ఫోన్లను తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. సేల్లో భాగంగా ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్ను కొనుగోలు చేస్తే ఇన్స్టంట్ డిస్కౌంట్ను అందివ్వనున్నారు.
అలాగే డెబిట్ కార్డు ఈఎంఐలు, క్యాష్బ్యాక్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా ఈ సేల్లో అందివ్వనున్నారు. అనేక రకాల ప్రొడక్ట్స్పై బై బ్యాక్ గ్యారంటీ, కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్లను అందివ్వనున్నారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్కార్ట్ తన దీపావళి సేల్లో అందివ్వనుంది.